top of page

వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 17, 2023
  • 1 min read

ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు.

ree

బుద్ధికి, సిద్ధికి గణనాథుడైన వినాయకుడు ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి కావడానికి విఘ్నాలన్నింటినీ తొలగించాలని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ఆకాంక్షించారు. దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్న ప్రభుత్వంగా పలు ప్రశంసలు, గుర్తింపులును పొందిందన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఎలాంటి అవరోధాలు లేకుండా ముందుకు సాగాలని,ప్రజల సంక్షేమం కోసం , అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడే ఈ ప్రభుత్వానికి సంపూర్ణ విజయాలు అందాలని ఆయన ఆకాంక్షించారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలుతో, ఆరోగ్యాలుతో జీవించాలని, పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మట్టి గణపతి విగ్రహాలునే వినియోగించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలకు, రాష్ట్రంలోని ప్రజలకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page