top of page

జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం రావణ కాష్టం - మందా శ్రీనివాసులు

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 17, 2022
  • 1 min read

జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం రావణ కాష్టం - మందా శ్రీనివాసులు

ree

రాజంపేట, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మందా శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాచర్ల లో టీడీపీ నాయకుల పై దాడులకు పాల్పడడం రాష్ట్రంలో అరాచక పాలనకు నిదర్శనమని అన్నారు. టీడీపీ నాయకుల పైన, కార్యాలయాల పైన దాడులు చేసి విధ్వంసం సృష్టించి భయబ్రాంతులకు గురి చేయడం ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. టీడీపీ వర్గీయుల కార్లు తగులబెట్టి బ్రహ్మానంద రెడ్డి ని అదుపులోకి తీసుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మాచర్లలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా టీడీపీ వర్గీయుల కార్లు తగలబెట్టిన వైసీపీ గుండాలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page