top of page

సిద్దయ్య స్వామి తిరుణాలకు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఆహ్వానం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 27, 2022
  • 1 min read

మైదుకూరు నియోజకవర్గం, దువ్వూరు మండలం సిద్దయ్య స్వామి తిరుణాల కు పుట్ట సుధాకర్ యాదవ్ ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించిన సిద్దయ్య మఠం ఆహ్వాన కమిటీ సభ్యులు. ఈమేరకు .ఆదివారము ఉదయం ప్రొద్దుటూరు పట్టణం లోని మైదుకూరు టిడిపి ఇంచార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ స్వగృహంలో ఆయనను కలసి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాలని కోరిన కమిటీ సభ్యలు. కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం ముడమాల గ్రామం లో వెలసిన జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములవారి ప్రియ శిస్యుడు శ్రీ సిద్దయ్య స్వాముల వారి తిరుణాల ఏప్రిల్ 2వ తేదీ నుండి 3వ తేదీ వరకు జరుగుతున్న సందర్భముగా ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ మాజీ చైర్మన్, మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పుట్ట సుధాకర్ యాదవ్ ని ఆహ్వానించిన శ్రీ సిద్దయ్య స్వామి మఠం మఠాధిపతులు వారి కుటుంబ సభ్యులు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page