top of page

విద్యుత్తు ను పొదుపుగా వినియోగించుకోవాలి - ఈఈ చంద్రశేఖర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 17, 2022
  • 1 min read

విద్యుత్తు ను పొదుపుగా వినియోగించుకోవాలి - ఈఈ చంద్రశేఖర్ రెడ్డి

ree

రాజంపేట, విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలని ఈ.ఈ చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. విద్యుత్ పొదుపు వారోత్సవాల్లో భాగంగా రాజంపేట డివిజన్ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది డివిజన్ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ కూడలి మరియు ఆర్.టి.సి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ.ఈ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మనం వాడే విద్యుత్ పరికరాలు త్రీ స్టార్ రేటింగ్ పైన ఉన్న వాటిని వాడాలని, ఎల్ఈడీ లైట్లు వాడాలని, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చెయ్యాలని తెలిపారు. మరియు ఏ.సి లను రిమోట్ తో ఆఫ్ చేసిన తరువాత స్విచ్ కూడా ఆఫ్ చేయాలని తెలిపారు. ఇలా చేయటం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకుంటూ భావితరాలకు మిగులు విద్యుత్తును అందించుటకు వీలవుతుందని అన్నారు.

ree

ఈ కార్యక్రమంలో డి.ఈ.ఈ లు యం. సురేంద్రనాథ్, మొరలిధర్ రెడ్డి, ఏ.ఏ.ఓ గంగయ్య, ఏ.ఇ లు చంద్రశేఖర్, ఉమాపతి, రామకృష్ణ, షఫీ, ఈశ్వర్ రాజు, విజయకుమార్ రెడ్డి, చలపతి, యోగానంద, బాలకృష్ణ మరియు విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page