top of page

ఎంపీ, ఎమ్మెల్యేలను సన్మానించిన మల్లిశెట్టి.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Sep 26, 2023
  • 1 min read

ఎంపీ మిథున్ రెడ్డి ,ఎమ్మెల్యే కొరముట్లను సన్మానించిన మల్లిశెట్టి.

ree

లోక్ సభ ప్యానల్ స్పీకర్, రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డిని, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులును మంగళవారం విజయవాడ ఎంపీ స్వగృహం లో ఘనంగా సన్మానించినట్లు ఏపీ కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు సభ్యులు మల్లిశెట్టి వెంకటరమణ తెలిపారు.

ree

తన రాజకీయ పురోగతిలో, తాను ఎంపికైన ఈ పదవిలో ప్రత్యేక చొరవ చూపించిన ఎంపీ ఎమ్మెల్యేల ఇరువురినీ కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ శాలువా,పుష్పగుచ్ఛం తో ఘనంగా సత్కరించినట్లు మలిశెట్టి వెంకటరమణ వివరించారు.ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు సాయి కిషోర్ రెడ్డి, లింగం లక్ష్మికర్ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page