top of page

మెగా జాబ్ మేళాను అందరూ సద్వినియోగం చేసుకోవాలి -- ఎల్వి మోహన్ రెడ్డి

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 3, 2022
  • 1 min read

వివిధ ఐఐటి కంపెనీలతో త్వరలో రైల్వేకోడూరు నందు ఏర్పాటు చేయబోయే మెగా జాబ్ మేళా ను మండల వ్యాప్తంగా చదువుకున్న విద్యార్థినీ, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఈరోజు ఉదయం చిట్వేలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా అవగాహన కార్యక్రమంలో వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కరోనా ఇబ్బందులతో గత రెండు సంవత్సరాలుగా చాలామంది బయట వెళ్లి ఉద్యోగాలు పొందడం లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అట్టివారికి ఇది ఒక చక్కని అవకాశం అని; జాబ్ మేళా కు వెళ్లే అందరికీ రవాణా మరియు భోజన వసతులను తానే భరిస్తానని మోహన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ సంపత్ ,ఓ ఎస్ డి దుర్గాప్రసాద్,ఎంపిడిఓ సమత, వెలుగు అధికారి వెంకటేశ్వర్లు,ఎంపీపీ చంద్ర తదితరులు జాబ్ మేళా యొక్క విశిష్టతను అవసరాన్ని గురించి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల కార్యదర్శులు, వాలంట్రిలు, వెలుగు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page