top of page

కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Mar 30, 2022
  • 1 min read

కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం ఏర్పాటు :

ree

వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు లోని స్థానిక మైదుకూరు రోడ్డు అన్వర్ టాకీస్ సమీపంలో నేడు కొత్తపల్లె సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి స్థాపించిన కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘురామిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి తాపానికి ప్రజల దాహార్తిని తీర్చటం కొరకు, ప్రొద్దుటూరుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే వారి సంఖ్య అధికమని వారికి అందుబాటులో ఉండేలా ఇక్కడ చల్లటి త్రాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ఫౌండేషన్ ద్వారా ప్రతి రోజు మధ్యాహ్నం పది రూపాయలకే రుచికరమయిన భోజనాన్ని ఏర్పాటు చేయటాన్ని ప్రశంసించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కొనిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page