పలుగురాళ్లపల్లె లో వైద్య శిబిరం ఏర్పాటు
- PRASANNA ANDHRA

- Jan 29, 2022
- 1 min read

వైఎస్ఆర్ కడప జిల్లా, మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారిమఠం మండలంలోని, పలుగురాళ్లపల్లె పీహెచ్సీ పరిధిలోని యర్రంపల్లె గ్రామంలో జ్వరాలు వస్తున్నాయని తెలియడంతో శనివారం స్థానిక వైద్యాధికారి ఎమ్మెస్ చెన్నకేశవరావు ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారు.
ఎర్రంపల్లె మెయిన్, ఎర్రంపల్లె ఎస్సీ కాలనీ లోని దాదాపు 110 మంది కి వైద్య సేవలు అందించినట్లు వైద్యాధికారి ఎమ్మెస్ చెన్నకేశవరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, స్థానిక గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








Comments