top of page

ఘనంగా వికలాంగుల దినోత్సవం

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 4, 2022
  • 1 min read

ఘనంగా వికలాంగుల దినోత్సవం

ree

రాజంపేట, మన్నూరులో రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం కార్యాలయం లో రాజంపేట అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ అధ్యక్షతన వికలాంగుల దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర నాయకులు చేర్లోపళ్లి రెడ్డప్ప, రాజంపేట పట్టణ మహిళా కార్యదర్శి మిరియాల సురేఖ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మిరియాల సురేఖ మాట్లాడుతూ వికలాంగులు ప్రతేకమైన నైపుణ్యాలు కలిగి ఉంటారని అన్నారు. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు.

ree

వైసీపీ రాష్ట్ర నాయకులు రెడ్డప్ప మాట్లాడుతూ సి.యం జగన్ మోహన్ రెడ్డి వికలాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. వికలాంగుల రిజర్వేషన్ 4శాతానికి పెంచడం, పింఛన్లు సరిసమానంగా చేయడం మొదలైన చర్యలు తీసుకోవడం వలన వికలాంగుల అభివృద్ధి కోసం దోహదం చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుణశేఖర్, పుల్లంపేట అద్యక్షుడు సుబ్బా నర్సా రెడ్డి, వాలంటీర్ సుధాకర్, శ్రీను, జైనుల్ పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page