top of page

హిందూ, ముస్లింల స్నేహానికి ప్రతీక ఉరుసు - ఎమ్మెల్సీ రమేష్ యాదవ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 15, 2022
  • 1 min read

హిందూ, ముస్లింల స్నేహానికి ప్రతీక ఉరుసు - ఎమ్మెల్సీ రమేష్ యాదవ్


దువ్వూరు మండలం, యల్లాలు కొట్టాలు గ్రామంలో జరిగిన "శ్రీ శ్రీ శ్రీ దస్తగిరి స్వామి ఉరుసు" మహోత్సవంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తో కలిసి పాల్గొన్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నూర్ బాషా కార్పొరేషన్ డైరెక్టర్ నొస్సం పెద్ద దస్తగిరి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కి ఘన స్వాగతం పలికి దస్తగిరి స్వామి కి చదివించిన ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దువ్వూరు ఎంపీపీ శ్రీ కానాల జయచంద్రారెడ్డి, మాజీ డిసిసిబి చైర్మన్ తిరుపాల్ రెడ్డి, ప్రొద్దుటూరు ఐదవ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, కల్లూరు ప్రసాద్ రెడ్డి, సంగన హరినాథ రెడ్డి, ఇతర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page