సీఎం ను కలిసి చిట్వేలు సమస్యలను వివరించిన చెవ్వు, మలిశెట్టి, లింగం
- DORA SWAMY

- Mar 24, 2022
- 1 min read

రాజధాని అమరావతి అసెంబ్లీ ఆవరణ లో నిన్నటి రోజున గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని, ప్రభుత్వ విప్ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు తో కలిసి చిట్వేలు వైసీపీ మండల కన్వీనర్ శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మలిశెట్టి వెంకటరమణ, రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లింగం లక్ష్మికర్ మర్యదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.
మండల పరిధిలోని పలు సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. మండల వ్యాప్తంగా పలు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపడతామని వారన్నారు.












Comments